Wednesday, June 23, 2010

నీవు

ప్రాస ప్రాణమై పల్లవించే -

పదాలని పలికించే స్వరం

నావరమైనదీ ,

మనసులోనూ మేధలోనూ

కవిత్వం అంతర్లీనమైనదీ

నీ ప్రేమతోనే కాబోలు .

అవును నీవే కవితవి ?

ప్రబంధ బందానివా

నాపై దయ వర్షించు .

చందో చర్చిత ద్యానివా ?

కాదు అది మరీ ష్టమూ ,కృతకమూను

నీవో
మధుర లావణ్య

ఉల్లాస శోకతప్త గీతానివి .

పల్లె పాటవి .

అప్పుడప్పుడు కన్నీళ్ళతో ,

ఒక్కోసారి చిరునవ్వులతో

మరోసారి

ఆనందాశ్రు మిళితానుభూతి తో

ప్రకృతి పాడే పాటవి ...






No comments:

Post a Comment